Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్‌పై చర్యలకు మత్స్యకారుల ధర్నా

భవేష్ కుమార్ Jul 27, 2026 6:17 PM నాగర్ కర్నూల్తెలంగాణ
సర్పంచ్‌పై చర్యలకు మత్స్యకారుల ధర్నా - Udayam Digital
నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. గుడిపల్లి రిజర్వాయర్‌లో చేపల వేట విషయంలో తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న నర్సాయిపల్లి సర్పంచ్‌ రాములుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడిపల్లి, గౌరీదేవిపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులపై సర్పంచ్‌, గ్రామస్తులు దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...