వార్తలకు తిరిగి వెళ్లండి
మత్స్యకారుల ఆచూకీపై ఆందోళన

సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ రెండు రోజులైనా లభించకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన తీవ్రమైంది. దీంతో విశాఖ చేపలరేవు బోటు ఆపరేటర్ల సంఘ కార్యాలయంలో బాధితులు, నాయకులు సోమవారం నిరసన చేపట్టారు.
ఆందోళనకారులతో ఆర్డీవో దిలీప్చక్రవర్తి మాట్లాడి నచ్చజెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...