వార్తలకు తిరిగి వెళ్లండి
తొలి ఏకాదశి వేడుకలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.
పాలమూరు పిల్లలమర్రి రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...