Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తారాపీఠ్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం.. 7 మంది మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 10:39 AM ఆల్ ఇండియా జాతీయ
తారాపీఠ్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం.. 7 మంది మృతి - Udayam
పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 4 గంటల సమయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ యూనిట్లలో సాంకేతిక లోపం కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసి మృతులు, గాయపడిన వారిని రాంపూర్‌హాట్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...