Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలపై 45 కాలేజీలకు జరిమానా

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 08, 2026 2:01 PM రంగారెడ్డి తెలంగాణ
నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలపై 45 కాలేజీలకు జరిమానా - Udayam Digital
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు చెందిన 52 నకిలీ ఫైర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఇతర జిల్లాల్లోనూ నకిలీ పత్రాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ కాలేజీల పత్రాలపై ఆడిట్‌కు ఆదేశించారు. తప్పుడు ధ్రువీకరణలతో నెట్టుకొస్తున్న 45 కాలేజీలకు రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించారు.

Comments

G
Loading comments...