వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం అప్పిరెడ్డి గ్రామానికి వెళ్లే రోడ్డుపై వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను 8వ వార్డు సభ్యుడు శ్రీనివాస్ సొంత ఖర్చుతో మరమ్మతు చేయించారు. జేసీబీ సహాయంతో గుంతల్లో మట్టి వేసి రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.
ప్రమాదాలు నివారించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు. గ్రామస్థులు, వాహనదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
