వార్తలకు తిరిగి వెళ్లండి
డీమ్డ్ వర్సిటీల్లోనూ ఫీజు రీయింబర్స్మెంట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. డీమ్డ్ యూనివర్శిటీల్లో యూజీ కోర్సులు చదివే విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ స్కీమ్తో అనుసంధానించారు. దీనివల్ల ఎస్సీలకు 60 శాతం, ఎస్టీలకు 75 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. మిగిలిన రాష్ట్ర వాటాను పీ-4 విధానంలో ఏపీ ప్రభుత్వం చెల్లించి విద్యార్థులకు చేయూతనివ్వనుంది.
Comments
Loading comments...