వార్తలకు తిరిగి వెళ్లండి

మాటలతో కాకుండా చేతలతో హామీలను నిలబెడుతున్నామని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. రాయలసీమ ఆత్మగౌరవమైన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జూలై 3న సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని ఆమె తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పన తర్వాతే పనులు చేపడుతున్నామని, దీనివల్ల స్థానికులకు భారీగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్లాంట్ పేరుతో కేవలం ప్రజలను మభ్యపెట్టిందని ఆమె విమర్శించారు.
Comments
Loading comments...

