వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో బుక్ చేసుకుని 24 గంటలు దాటినా యూరియా పంపిణీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమయానికి యూరియా అందకపోవడంతో రైతులు కేంద్రం వద్ద చెప్పులను వరుసలో పెట్టి బారులు తీరారు. యాప్ ద్వారా బుకింగ్ చేసినా యూరియా కోసం వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

