వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మండలంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే తెరుచుకోకపోవడం, సర్వర్ బిజీగా ఉండటంతో అవస్థలు తప్పడం లేదని వారు వాపోతున్నారు. యాప్ తెరుచుకున్నా నిమిషంలోపే ‘నో స్టాక్’ చూపిస్తోందని వారు తెలిపారు.
కీలక సమయంలో పంటలకు ఎరువు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలకు అవసరమైన యూరియాను తక్షణమే అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

