వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులతో కలిసి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రధాన హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎండిపోయిన కాలువలో కూర్చొని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.
Comments
Loading comments...

