వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కొరతపై రామాయంపేట మండల కేంద్రంలో రైతులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. పట్టణానికి మూడు లారీల యూరియా చేరినా నిమిషాల్లోనే బుకింగ్ పూర్తవడంతో పలువురు రైతులకు ఎరువు దక్కలేదు.
దీంతో మెదక్–సిద్దిపేట ప్రధాన రహదారిపై వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అవసరమైన సమయంలో యూరియా అందకపోతే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

