వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండలో వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయం కాకుండా కేవలం రెండు గంటలే కరెంట్ ఇవ్వడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు.
దీనికి నిరసనగా గురువారం రైతులు విద్యుత్ ఉపకేంద్రం వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

