Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతుల ధర్నా

రచన దేవి Jul 23, 2026 11:15 AM యాదాద్రి భువనగిరిin about 5 hours
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల సబ్‌స్టేషన్ ఎదుట కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షాల వేళ అప్రకటిత కోతలతో కష్టాలు రెట్టింపు అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...