వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రశ్నార్థకంగా రైతు వేదికల భద్రత

Photo Gallery
జిల్లాలో రైతు వేదికల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కాపలా లేకపోవడం, ఊరి బయట ఉండటంతో రూ.లక్షల విలువైన టీవీలు, సామగ్రికి చోరీ భయం పట్టుకుంది. రాత్రివేళల్లో ఇవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి.
ఇచ్చోడ మండలం నర్సపూర్లో తలుపులు లేక భవనం అధ్వానంగా మారింది. సిరికొండ, పిప్పిరిలలో కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. అధికారులు స్పందించి వీటి నిర్వహణ, భద్రతపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు
Comments
Loading comments...
