వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులకు అలర్ట్.. ఈనెల 20 తర్వాత భారీ వర్షాలు!

వర్షాలు లేక ఆందోళన చెందుతున్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త అందించింది. ఈనెల 20వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
'ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్' (ITCZ) ప్రభావంతో భారీ మేఘాలు ఏర్పడుతున్నాయని, ఈనెల 20 నుండి 30వ తేదీల మధ్య వర్షాలు కురిసి రైతులకు పెద్ద ఊరటనిస్తాయని అంచనా వేస్తోంది.
Comments
Loading comments...