వార్తలకు తిరిగి వెళ్లండి
వెయ్యి కోసం వ్యక్తి దారుణ హత్య

వనస్థలిపురంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఉన్న బాధితుడి వద్ద నుంచి రూ.వేయి, సెల్ఫోన్ దొంగిలించిన శ్రీరాములు, నర్సింహ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
బాధితుడు నిద్రలేచి తిరగబడటంతో నిందితులు తలపై రాయితో మోది హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...