వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్లోని సుపౌల్ జిల్లాలో వరి పొలంలో కనిపించిన మొసలిని రైతులు చాకచక్యంగా పట్టుకున్నారు. దాని మూతికి తాళ్లు కట్టి అమిత్కుమార్ అనే రైతు భుజాలపై మోసుకుంటూ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు.
అటవీ శాఖ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకుని ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు. అనంతరం సమీపంలోని నదిలో విడిచిపెట్టారు. రైతు మొసలిని మోసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Comments
Loading comments...
