వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా వీరవల్లిలో సహకార సంఘం కార్యదర్శి హేమ, ఆమె భర్త బాలాజీ, కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు హేమ బంధువులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే ఇంటికి చేరుకున్నారు. పీఏసీఎస్లో అక్రమాలపై జరుగుతున్న విచారణే ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

