వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిషా ట్రక్కర్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఏపీఎస్ఏసీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డిషా సహకారంతో కార్యక్రమం చేపట్టి కరపత్రాలు పంపిణీ చేశారు.
ప్రాజెక్టు మేనేజర్ ఎం.మాధవరావు హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ కె.నరసింహమూర్తి పాల్గొన్నారు.
Comments
Loading comments...

