వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్ఐఆర్ ఫారముల డిజిటలీకరణ గడువులోగా పూర్తి చేయాలి

ర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్లో జరుగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. ఓటర్లు పూర్తి చేసి ఇచ్చిన ఫారముల డిజిటలీకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు ఈ డిజిటలీకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బిఎల్ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారములను సేకరించాలని, ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సూపర్వైజర్లు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
Comments
Loading comments...