వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యోగుల సభ వాయిదా: బొప్పరాజు

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున ఆదివారం నాటి శ్రీకాకుళం సన్నద్ధత సమావేశాన్ని వాయిదా వేసుకున్నామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పీఆర్సీ, ఐఆర్, డీఏ, హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రితో మరో సమావేశం ఉంటుందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు.
Comments
Loading comments...