వార్తలకు తిరిగి వెళ్లండి
ఆక్వా రైతులను మోసం చేసిన బాబు: నాని

ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫీడ్ ధరలు భారీగా పెంచి ప్రభుత్వం ఆక్వా రైతుల నడ్డి విరిచిందని దుయ్యబట్టారు.
రొయ్యల మేత తయారీదారులంతా చంద్రబాబు చందాదారులేనని ఆరోపించారు. కేజీకి 12 రూపాయలు పెంచి కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించారని మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై నాని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
Comments
Loading comments...