వార్తలకు తిరిగి వెళ్లండి
సీఐ వేధింపులతో ఉద్యోగి మృతి

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల వేధింపులు తాళలేక లైబ్రేరియన్ షేక్ దరియా హుస్సేన్ తన పుట్టినరోజే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సివిల్ వివాదంలో సీఐ శ్రీరాం వెంకట్రావు గంజాయి కేసు పెడతానని బెదిరించడమే కారణమని మృతుడు సూసైడ్ లెటర్లో పేర్కొన్నాడు.
ఉర్దూ అకాడమీ ఉద్యోగి అయిన హుస్సేన్, స్థానిక ఇళ్ల స్థలం వివాదంలో కోర్టు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీఐ వేధింపులకు పాల్పడినట్లు భార్య అమీరున్ ఆరోపించారు.
Comments
Loading comments...