వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సేవకు అంకితమైన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవలో నిబద్ధతకు వాజ్ పేయి నిలువెత్తు నిదర్శనమన్నారు.
Comments
Loading comments...

