వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించనుంది. డిస్కంలు ఇంధన సర్దుబాటు ఖర్చుల్లో రూ.940 కోట్ల మిగులును చూపించాయి. దీనితో రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు మరోమారు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది యూనిట్కు 13 పైసలు తగ్గగా, ఈసారి కూడా అదే స్థాయిలో తగ్గే వీలుంది. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఈఆర్సీ (ERC) ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనుంది.
Comments
Loading comments...

