వార్తలకు తిరిగి వెళ్లండి

మధిరకు చెందిన 74 ఏళ్ల గద్దల లక్ష్మయ్య కాళ్లు సహకరించకపోయినా, చెప్పులు కుడుతూ జీవిస్తున్నారు. పాత ట్రైసైకిల్ పాడవడంతో పనికి వెళ్లేందుకు ఆయన రోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తన కష్టార్జితంలో కొంత భాగాన్ని సహాయకుడికే ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు. అధికారులు దయతలిచి బ్యాటరీ ట్రైసైకిల్ను మంజూరు చేస్తే, తాను స్వతంత్రంగా పనిచేసుకుని జీవించగలనని లక్ష్మయ్య వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

