Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటా 7 లక్షల మెట్రిక్ ధాన్యం పండిస్తున్నాం

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:21 AM కామరెడ్డిGeneral
ఏటా 7 లక్షల మెట్రిక్ ధాన్యం పండిస్తున్నాం - Udayam
వ్యవసాయ రంగంలో బాన్సువాడ నియోజకవర్గం ముందంజలో ఉందని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్లెడ్డి అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇతర ప్రాంతాల్లో నారుమడులు పోసే సమయానికే బాన్సువాడలో పంటలు కోతలకు వచ్చేంతగా వ్యవసాయం అభివృద్ధి చెందిందన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకతలోనూ నియోజకవర్గం ముందుందని, ఏటా సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...