Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీకి పట్టుపడ్డ ఎస్సై ఆంజనేయులు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 7:16 PM కామరెడ్డిGeneral
ఏసీబీకి పట్టుపడ్డ ఎస్సై ఆంజనేయులు - Udayam
కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్టేషన్ ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎస్సైను పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Comments

G
Loading comments...