Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగల సంచారం ... ప్రజలను అప్రమత్తం చేసిన అదికారులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 10:05 AM విజయనగరంGeneral
ఏనుగల సంచారం ... ప్రజలను అప్రమత్తం చేసిన అదికారులు - Udayam
కొమరాడ మండలం గుణానపురం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం ఉదయం తెలిపారు. ఈ మేరకు గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రస్తుతం ఖరీఫ్‌ పంటల సాగు సమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ఏనుగుల గుంపును వెంటనే ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్తానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...