Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కాంగో, ఉగాండాల్లో ఎబోలా కల్లోలం: 101 మంది మృతి

Ravi Shukla Jun 09, 2026 8:22 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
కాంగో, ఉగాండాల్లో ఎబోలా కల్లోలం: 101 మంది మృతి - Udayam Digital
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 550కి చేరగా, ఇప్పటివరకు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కొత్తగా కేసులు, మరణాలు వేగంగా పెరుగుతుండటంతో వైద్యాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొరుగు దేశమైన ఉగాండాలోనూ 'బుండిబుగ్యో' ఎబోలా రకం వ్యాప్తి చెందుతోంది. ఈ రకానికి సరైన వ్యాక్సిన్, మందులు అందుబాటులో లేకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం బాధితులకు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందుతోంది.

Comments

G
Loading comments...