వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖలో భూమి ప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. విశాఖలోని మధురవాడ, జగదాంబ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెల్లవారుజామున 5.07 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.
Comments
Loading comments...