వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

వరుస సెలవులతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ 5 కిలోమీటర్ల మేర విస్తరించింది.
శుక్రవారం 73,265 మంది స్వామివారిని దర్శించుకోగా, రూ.4.26 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Comments
Loading comments...