వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన వేలంలో క్వింటాల్ పసుపు గరిష్టంగా రూ. 15,000 ధర పలికింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పసుపు కొమ్ముల రకం క్వింటాల్కు రూ. 11,000 నుంచి రూ. 15,000 వరకు విక్రయమవ్వగా, కాయ రకం పసుపు రూ. 11,000 నుంచి రూ. 14,800 వరకు ధర లభించింది. క్రితం వారంతో పోలిస్తే పసుపు ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

