Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుడ్డుఖల్లు పీహెచ్సీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 8:45 PM పార్వతీపురం మన్యంGeneral
దుడ్డుఖల్లు పీహెచ్సీలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలపై ఆరా తీశారు. హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి సిబ్బంది సమయపాలనను పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...