వార్తలకు తిరిగి వెళ్లండి

మార్టూరు మండలం ద్రోణాదులలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పల్లెపాగు జయరావు, పల్లెపాగు వీరయ్యలకు చెందిన సుమారు 10 ట్రక్కుల వరిగడ్డి వాము అగ్నికి ఆహుతైంది. ఎవరో నిర్లక్ష్యంగా పొగతాగడం వల్లే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...

