వార్తలకు తిరిగి వెళ్లండి
వాతావరణ మార్పులతో అనారోగ్య సమస్యలు
Harika Jun 22, 2026 9:41 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

నగరంలో వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరుగుతోంది. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమై, బస్తీ దవాఖానాల సిబ్బందిని అంటువ్యాధులపై పర్యవేక్షణకు ఆదేశించింది.
పౌరులు బయట ఆహారానికి దూరంగా ఉండటం, కాచి చల్లార్చిన నీటిని తాగడం మరియు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. లక్షణాలు తగ్గని పక్షంలో వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...