వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండటంతో కర్నూలు జిల్లా గూళ్యం గ్రామస్థులు వినూత్న పూజలు నిర్వహించారు. వరుణుడి అనుగ్రహం కోసం గాడిదలకు పెళ్లి చేసి ప్రత్యేకంగా ఊరేగింపు చేపట్టారు.
వేదవతి నదిలో గంగ పూజ అనంతరం గాడిదలకు అలంకరణ చేసి వివాహం జరిపించారు. డప్పుచప్పుళ్లు, బాణసంచాలతో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి వర్షాలు కురవాలని ప్రార్థించారు.
Comments
Loading comments...
