Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నల అకౌంట్లలోకి నగదు జమ

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 16, 2026 10:13 AM అమరావతిGeneral
నేతన్నల అకౌంట్లలోకి నగదు జమ - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అర్హులైన సుమారు 55 వేల మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ పథకాన్ని రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి చేనేత అనుబంధ రంగాలకూ వర్తింపజేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...