Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల పునరావాస కేంద్రంలో గురు పూజోత్సవం

Follow Udayam on Google
B Santosh Kumar Sep 05, 2026 5:09 PM నిజామాబాద్General
దివ్యాంగుల పునరావాస కేంద్రంలో గురు పూజోత్సవం - Udayam
ధర్పల్లి మండలంలోని శుభోదయం NHC దివ్యాంగుల పునరావాస కేంద్రంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల సమాఖ్య కార్యదర్శి గంగలక్ష్మి మాట్లాడుతూ, దివ్యాంగులతో గురు పూజోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందని, వారిలో ఆత్మవిశ్వాసం, సంతోషాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...