Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22 నుంచి జిల్లా స్థాయి త్వైక్వాండో పోటీలు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 5:44 PM నంద్యాలఆంధ్రప్రదేశ్
22 నుంచి జిల్లా స్థాయి త్వైక్వాండో పోటీలు - Udayam
నంద్యాలలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి త్వైక్వాండో ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా గౌరవాధ్యక్షుడు గొల్ల రాజేశ్ తెలిపారు. సోమవారం క్రీడాకారులతో కలిసి పోటీల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...