Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది తీరుపై అసంతృప్తి

Follow Udayam on Google
మానస శర్మ Aug 13, 2026 2:46 PM పశ్చిమగోదావరి General
రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది తీరుపై అసంతృప్తి - Udayam
పశ్చిమగోదావరి జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటలు దాటినా, కొన్ని కేంద్రాల్లో 10.30 గంటలైనా సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో కార్యాలయాలకు ఎప్పుడు రావాలో తెలియక నిరీక్షించాల్సి వస్తోందన్నారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...