Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్లొమా-ఐటీఐ అనుసంధానంపై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 3:40 PM సంగారెడ్డితెలంగాణ
డిప్లొమా-ఐటీఐ అనుసంధానంపై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా - Udayam
డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె.సతీష్‌ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా నిర్వహించారు. జీవో నంబర్‌ 97ను రద్దు చేసి ఎస్‌బీటీఈటీని కొనసాగించాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...