వార్తలకు తిరిగి వెళ్లండి

'డిజిటల్ అరెస్టు' పేరుతో 76 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి దంపతులను భయపెట్టి రూ.1,46,50,520 కాజేసిన కేసులో కేరళకు చెందిన షబ్బీర్ (40)ను విశాఖ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
ఈడీ, సీబీఐ అధికారులమంటూ బెదిరించి ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో నగదు బదిలీ చేయించారు. షబ్బీర్ ఖాతా ద్వారా రూ.92 లక్షలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది.
Comments
Loading comments...

