Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో వినాయక మండపాల నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Devender Bale Sep 13, 2026 8:19 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో వినాయక మండపాల నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం - Udayam
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి సూచించారు. మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక శబ్దం, డీజేలకు దూరంగా ఉండాలని సూచించారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలను పాటిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు.

Comments

G
Loading comments...