వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఈజేఏసీ కేంద్ర నాయకత్వం ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం మహబూబ్నగర్ కలెక్టరేట్ గేటు వద్ద జిల్లా స్థాయి ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఛైర్మన్ డా. జి.రాజీవ్రెడ్డి, కన్వీనర్ ఎస్. విజయ్కుమార్ తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

