వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలం 2026-27లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో 736 కేంద్రాల ద్వారా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందని తెలిపారు. గన్నీ బ్యాగులు, గోడౌన్లు, వాహనాలు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

