వార్తలకు తిరిగి వెళ్లండి
బీరన్న బోనాలకు భక్తుల వెల్లువ

తొలి ఏకాదశి సందర్భంగా ఓరుగల్లు కరీమాబాద్ బీరన్నస్వామి ఆలయంలో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. కురుమ కులస్థులు వందలాది బోనాలతో తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు.
వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోగా, మహిళల బోనాల ప్రదర్శనలు, కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తుకొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...