వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యేష్ఠ మాసం శనివారం కావడంతో ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి.
Comments
Loading comments...

