Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఆర్‌తో భక్తుడికి ప్రాణదానం

సీపీఆర్‌తో భక్తుడికి ప్రాణదానం - Udayam Digital
కాకినాడ జిల్లా కోటనందూరు ఎస్సై టి.రామకృష్ణ సకాలంలో సీపీఆర్‌ చేసి ఓ భక్తుడి ప్రాణాలను కాపాడారు. తలుపులమ్మ తల్లి లోవలో దర్శనం ముగించుకుని వస్తుండగా భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్‌ నిర్వహించడంతో బాధితుడు స్పృహలోకి వచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా వైద్యుల చికిత్సతో భక్తుడు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...